TG: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్య చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. ఇక్కడ IVF కేంద్రం ప్రారంభమైన తర్వాత, తొలిసారిగా ఆ చికిత్స ద్వారా ఓ మహిళ విజయవంతంగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. నిరుపేదలకు ఖరీదైన సంతాన సాఫల్య చికిత్సను ఉచితంగా అందిస్తూ గాంధీ వైద్యులు అరుదైన విజయాన్ని అందుకున్నారు.