W.G: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ బుధవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. 22-ఏ రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియ, జలధార-జలహారతి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.