ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పనిముట్లను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు పనిముట్లు, రక్షణ పరికరాలను అందజేశామన్నారు. ఈ పరికరాలు నగర స్వచ్ఛతకు దోహదపడతాయన్నారు.