AP: శ్రీకాకుళంలో డయేరియాతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంపై YCP చీఫ్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి దారితీసిందని విమర్శించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోందన్నారు.