GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. లాలాపేటలోని శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీసం 10 ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.