MBNR: హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం SSC విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.