సత్యసాయి: ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన పోస్టర్లను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, MLA పల్లె సింధూర రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల నివారణకు క్షేత్రస్థాయిలో యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని, హాస్టళ్లు, పాఠశాలల్లో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని సూచించారు.