AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని తెలిపారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ‘ఈగల్’ అనే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.