NZB: ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ మంత్రి KTRకు ఆర్మూర్లో బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు గురించి అడిగితే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచకాలను బయటపెడతామని హెచ్చరించారు.