‘ది కేరళ స్టోరీ 2’పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా రాష్ట్ర ప్రతిష్టను, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందన్న పిటిషన్పై విచారణ చేపట్టింది. కేరళను తప్పుగా చిత్రీకరించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికేట్పై నిర్ణయం తీసుకునే ముందు, ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోర్టు నిర్మాతలను ఆదేశించింది.