కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించే అన్నదాన పథకానికి రాజమహేంద్రవరం వాస్తవ్యులు మిధున్ చక్రవర్తి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని మంగళవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ధాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.