ATP: గుంతకల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27న స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రారంభమయ్యే హుండీ లెక్కింపు కార్యక్రమానికి ఆలయ సిబ్బంది విధిగా హాజరుకావాలని సూచించారు.