ఖమ్మం జిల్లాలో సోమవారం రాత్రి వచ్చిన గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. గ్రామాల్లో ఈసారి అధిక మొత్తంలో సాగు చేసిన మొక్కజొన్న మరో నెలలో చేతికి రానున్న తరుణంలో అకాల వర్షం రైతులను పూర్తిగా నష్టపరిచింది.