VZM: రాజాం పట్టణంలో పందుల బెడద తీవ్రంగా మారింది. సత్యనారాయణపురం, ఆదర్శనగర్, మెంతిపేట కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండటంతో పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఇళ్లలోకే ప్రవేశిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాధుల ముప్పు పెరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.