NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మళ్లీ వాయిదా పడింది. రెండు సార్లు పోలీసులు విచారణను వాయిదా వెయ్యగా ఈసారి మాజీ మంత్రి కాకాణి వంతు వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 24న విచారణకు రాలేనంటూ ఆయన సోమవారం పోలీసులకు లేఖ రాశారు. 27వ తేదీన వస్తానని పేర్కొన్నారు. కొన్ని రోజుల కింద బాలిక మృతి ఘటనలో ఆయనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.