TPT: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మొత్తం 52 వినతులు అందాయి. కార్పొరేషన్ ఇంజనీరింగ్ (11), రెవెన్యూ (13), కమిషనర్ (11) తదితర విభాగాలకు చెందిన సమస్యలు ప్రధానంగా వచ్చాయి. ప్రజల సమస్యల త్వరగా పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.