W.G: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం పాలకొల్లులో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గాంధీబొమ్మల సెంటర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొలుత పూజలు నిర్వహించిన అనంతరం నిరసన తెలిపారు. వివాదాస్పదంగా మారిన నాయుడును వెంటనే సస్పెండ్ చేసి, టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు.