WGL: వర్థన్నపేట పట్టణ కేంద్రంలోని 3వ వార్డులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యుత్ ఏఈ తరుణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ తీగల పరిస్థితి, సరఫరా సమస్యలు, వంటి అంశాలను పరిశీలించి,ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.