GNTR: చేబ్రోలు మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. లబ్ధిదారలకు మొత్తం రూ.3,98,802లను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్సలకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.