SKLM: జిల్లా రైతాంగ దశాబ్దాల కల నెర వేరుతోందని, నేరడి బ్యారేజి నిర్మాణానికి అడ్డంకి తొలగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా జిల్లాలో అదనంగా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 115 TMCల జలాలను 50:50 నిష్పత్తిలో వాడుకునే అవకాశం లభించింది పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.