NLR: అనంతసాగరం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రెండేళ్ల క్రితం సుమారు 300 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో కొందరు ఇళ్లు నిర్మించుకోగా చాలా మంది ప్లాటును రూ. 3 నుంచి రూ.5 లక్షలకు అమ్ముకుంటున్నారు. సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటిని కూడా అమ్మేస్తున్నారు. వీటిపై దృష్టి సారించాలని శుక్రవారం స్థానికులు అధికారులను కోరుతున్నారు.