ప్రకాశం: మద్దిపాడు(మం) గుండ్లపల్లిలో శుక్రవారం దూదేకుల కాశం అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రానైడ్ ఫ్యాక్టరీలో స్టోన్ కటింగ్ ఆపరేటర్గా పని చేస్తున్న కాశం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.