E.G: జిల్లాలో అనధికారికంగా పాల విక్రయాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం స్పష్టం చేశారు. కల్తీ పాలు ఘటనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల పాల ఉత్పత్తి దారులు, విక్రేతలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు.