పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్ రూ.458.40, డీజిల్ రూ.520.35కి చేరింది. డీజిల్పై 54.9%, పెట్రోల్పై 42.7% పెంపు విధించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచే ధరలు అమల్లోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో పాక్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది రెండోసారి.