VZM: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన “సిటీ రీజియన్స్ యాజ్ గ్రోత్ హబ్” ప్రాజెక్టులో భాగంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కింద అమలు చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.