TPT: పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి సీఐ ఏవి రమణ సూచించారు. చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని, మొబైల్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. ఇళ్ల భద్రతపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.