MHBD: దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం అందేలా అధికారులు కృషి చేయాలని స్పష్టంచేసారు.