కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం, పోతుకుర్రు, మాగాం గ్రామాలలో ఉన్న వేప చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇది అరిష్టమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో వేప చెట్టును దేవత గా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా వేప చెట్లు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అటువంటి చెట్లు ఒక్కసారిగా ఎండిపోయి మోడుగా మారుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు.