ప్రకాశం: దొనకొండ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి దొనకొండకు బదిలీ అయ్యారు. గతంలో దొనకొండ ఎస్సైగా పనిచేసిన త్యాగరాజును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.