JGL: హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు కొండగట్టు అంజన్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. కొంగు బంగారంగా భావించే కొండగట్టు అంజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుముడితో వచ్చిన స్వాములు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీరి సౌకర్యార్థం ఇరుముడి సమర్పించుకోవడానికి ఆలయ ఆవరణలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.