AP: కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలు తెలంగాణను సాధించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితి బాధాకరమన్నారు. తెలంగాణలో ఎక్కువ ఎయిర్పోర్టులు రాకపోవడానికి కాంగ్రెస్, BRS ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పదేళ్లు BRS దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు.