GDWL: జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం హాస్టల్ భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.