RR: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండవ ఎడిషన్లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 4, 5 తేదీన నిర్వహించారు. ఇందులో రంగారెడ్డికి చెందిన ధనావత్ యశ్వంత్ టీ20 విభాగంలో 100 మీటర్ పరుగులో స్వర్ణ పథకం నెగ్గాడు. రెండో స్థానంలో HYD, మూడో స్థానంలో నల్గొండ నిలిచారు.
NRML: జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా జాదవ్ సుభాష్ శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసిన సలిరాం నాయక్ను బదిలీ చేసి అదిలాబాదులో పనిచేస్తున్న జాదవ్ సుభాష్ పదోన్నతి ద్వారా ఇక్కడికి బదిలీ చేయడంతో ఈయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అధికారికి పట్టణ ఏడిఈకె శ్రీనివాసరావు విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.
ASF: రెబ్బెన మండలం ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి జాతర వాల్ పోస్టర్లను కలెక్టర్ హరిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకుడు దేవర వినోద్ కలెక్టర్ను కలిసి జాతరకు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కళ్యాణం, 3న మహంకాళి జాతర, బోనాలు, రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
SRCL: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బట్టి పద్ధతిలో కాకుండా పిల్లలకు విషయ పరిజ్ఞానం అందేలా ఇంటరాక్ట్ చేస్తూ బోధన జరగాలన్నారు. ఉన్నతాధికారులు ప్రతి పాఠశాలను నాణ్యతతో తనిఖీ చేసి, రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు.
JGL: మహిళల ఆర్థిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో రూ. 10 లక్షలు, కట్కాపూర్లో రూ. 20 లక్షలు, వస్తాపూర్లో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టిన మహిళా సంఘాల నూతన భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. జడ్పీ సీఈవో, ఎంపీడీవో, ఎంపీవో, సర్పంచులు పాల్గొన్నారు.
BHPL: చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన యువ పాటల రచయిత మ్యాదరి సునీల్ను తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవమైన ‘నంది అవార్డు’ వరించింది. ఇవాళ హైదరాబాద్లో మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విశేష వేడుకలో ప్రముఖ నటుడు, కమెడియన్ బాబూమోహన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సునీల్ను జిల్లా ప్రజలు అభినందించారు.
BHNG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇవాళ ప్రారంభమైంది. ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో తంగడపల్లి 5వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 12 వరకు సాగే ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
SRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెంలో శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
NRPT: నారాయణపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో స్థానిక సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయ నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై రాముడు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని సూచించారు. పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు వెంటనే తెలియజేయమని కోరారు.
MDK: రామాయంపేట మున్సిపల్ కమిషనర్ బి. శ్రావణ్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్, మల్లెచెరువు సమీపంలోని జలవనరులు (వాటర్ బాడీస్), సిద్దిపేట రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం పరిసరాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను చూసి కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.
GDWL: రాజోలి, గద్వాల టౌన్ పరిధిలో లోన్ యాప్స్, టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగిన రెండు వేర్వేరు మోసాల్లో బాధితులు కోల్పోయిన రూ. 1,75,244 మొత్తాన్ని పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు. న్యాయస్థానాల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఈ నిధులను తిరిగి బాధితుల ఖాతాలకు మళ్లించారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
WNP: 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపై అవగాహన ర్యాలీ జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
NGKL: అచ్చంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మన్ను ప్రసాద్, రమేశ్ రావు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల అభివృద్ధిని గాలికి వదిలేశారని, ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు.
NLG: నేను విద్యనభ్యసించిన పలివెల పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పలివెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య హాజరై మాట్లాడారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు.
WNP: పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించాల్సిన సేవలు పారదర్శకంగా అందించాలని సూచించారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లల ఆరోగ్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చూపించండి.