NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని గచ్చుబావి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ సత్యం బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
MLG: జిల్లా ఏటూరునాగారం పట్టణానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ ఇటీవల గ్రూప్-1లో 105వ ర్యాంక్ సాధించి DSPగా ఎంపికయ్యాడు. అయితే నేడు విడుదలైన UPSC సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణను పారిశుద్ధ్య కార్మికురాలైన నానమ్మ పెంచింది. ప్రవీణ్ విజయంపై స్థానికులు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NZB: బాల్కొండ మండలం చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఓ రేకుల షెడ్డు కింద మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు 50-60 ఏళ్లు, 5 అడుగులు ఎత్తు ఉందని ఎస్సై శైలేందర్ శుక్రవారం తెలిపారు. మృతురాలి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరికైనా సమాచారం తెలిస్తే 8712659860 నెంబర్కు సంప్రదించాలన్నారు.
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని బుడుమ వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కోరారు.
GDWL: ధరూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇవాళ గ్రామపంచాయతీ పాలకవర్గం అలాగే పంచాయతీ కార్యదర్శులతో 99 రోజుల ప్రజా పాలన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, బోర్ వెల్స్ పునరుద్వర్ధన, ఘన పదార్థాలను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రత, చేపట్టాల్సిన అంశాలపై ప్రణాళిక సిద్ధం చేశారు.
కామారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 97.92 శాతం హాజరు నమోదైనట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,585 మంది విద్యార్థులకు గాను 6,448 మంది హాజరయ్యారని, 137 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.
SDPT: చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఇరువురు కమ్మరి నర్సయ్య, వైనాల భూమవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయం పంపించగా శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు స్థానిక నాయకులు అందజేశారు.
WGL: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం నగరంలో వేగంగా అమలవుతోంది. ఇందులో భాగంగా GWMC కార్యాలయం వద్ద స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
భూపాలపల్లిలో 2025-2026 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణకు ఇన్సర్వీస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. జుమ్లా నాయక్ తెలిపారు. సంబంధిత వృత్తిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్న, GPF/EPF/ESI కలిగి పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇన్సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వరంగల్ ITIను సంప్రదించాలన్నారు.
KMM: జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ కోసం అఖిలభారత అసంఘటిత కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాంజీ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ ఉపాధి హామీ పథకంపై రూపొందించిన వాల్ పోస్టర్లను శుక్రవారం మంత్రి ఖమ్మంలో ఆవిష్కరించారు. కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం పేదోడి పొట్టకొట్టే విధానాలను అవలంబిస్తుందన్నారు.
JN: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న వేం నరేందర్ రెడ్డిని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనగామలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారితో కాసేపు చర్చించారు. ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
BDK: ఇల్లందు పురపాలక ఛైర్ పర్సన్ శ్రీమతి దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా మంత్రికి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలు ప్రజలలో నూతన నమ్మకాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.
MHBD: మరిపెడ(M) కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో DSFI జాతీయ అధ్యక్షుడు డా. వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ సమాజానికి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా మోసం చేసిందని విమర్శించారు. CM స్పందించి చేవెళ్ల లో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
HNK: నడికూడ ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో శేషాద్రి సందర్శించి కార్యాలయ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. అనంతరం ఈజిఎస్ సిబ్బందితో సమావేశమై ఉపాధి హామీ పనుల అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. తొలిసారిగా ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన సీఈవోను అధికారులు సన్మానించారు. ఎంపీడీవో రామకృష్ణ, MEO హనుమంతరావు, APO విద్యావతి ఉన్నారు.
WNP: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రగతి వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఆయన హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు.