chandur congress party office fire accident
మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ ఆదరణ చూసి తట్టుకోలేకనే…ప్రత్యర్థులే ఈ దశ్చర్యకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. పార్టీ ఆఫీసుపై దాడి చేసి దిమ్మలు కూల్చినా …మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బెదిరించాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: HYDలో వర్షం…భయాందోళనలో ప్రజలు!

