ADB: ఆదిమ గిరిజనులైన నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉమ్మడి జిల్లా ఆదివాసీలతో సమావేశమయ్యారు. టైగర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో ఆదివాసీ అటవీ హక్కు చట్టం ప్రకారం రాయితీలు కల్పించాలన్నారు. పట్టా భూమి గల ఆదివాసీలకు సాగునీరు అందించాలనీ పేర్కొన్నారు.