తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.
intintiki telugudesam:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (tdp) జాడ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో కీ రోల్ పోషిస్తోన్న.. తెలంగాణలో మాత్రం ప్రభావం లేదు. పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోయారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్కు (kasani gnaneshwar) తెలంగాణ టీడీపీ పగ్గాలను చంద్రబాబు (chandrababu) అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాసాని (kasani) వ్యుహారచన చ...
మార్చి 2వ తేదిన తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ కార్డును కూడా కుటుంబీకులు ముద్రించారు. ఆ కార్డులో వెల్ విషర్స్ గా బాలక్రిష్ణ(Balakrishna), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) పేర్లను ముద్రించడం విశేషం.
ys sharmila meet governer:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్లో (Raj bhavan) గవర్నర్తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
preethi is still critical:మెడికో ప్రీతి (preethi) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ (health bulletein) విడుదల చేశారు. ప్రీతికి ఆధునాతన వైద్యం అందజేస్తున్నామని.. ఆమెను బ్రతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రీతికి (preethi) ఎక్మో, వెంటిలేటర్పై చికిత్స ఇస్తున్నామనివివరించారు.
విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. హర్ష మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. అతడు తెలివైన విద్యార్థి. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసు’ అని ప్రిన్సిపల్ తెలిపాడు.
మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు (Palmology), పుట్టుమచ్చలు (Moles), ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతామని చెప్పి వ్యక్తిగత ఫొటోలు తీసుకుంటున్న ముఠా ఆగడాల గుట్టు రట్టయ్యింది. వారు చేస్తున్న బాగోతాలు అన్నీ బహిర్గతమయ్యాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్శిటీలో విద్యార్ధి సంఘాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. మొన్న మధ్య బీసీసీ (BBC) డాక్యుమెంటరీ ప్రదర్శనపై గొడవ జరిగింది. ఇప్పుడు మరోసారి గొడవలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని హెచ్ సీ యు వార్తల్లో నిలిచింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్థుల మధ్య ఘ...
సీఎం సీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిందే పెద్ద కుట్ర అని బీఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) ఆరోపించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ (BSP) కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రీతి (Preeti) కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కుమార్ ఆరోపించారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ (Street corner)మీటింగ్ కు సంజయ్ పాల్గోన్నారు. నిందితుడికి మద్దతుగా ప్రభుత్వం ధర్నా చేయిస్తుందని మండిపడ్డారు. ప్రీతి తల్లి తండ్రులకు గర్బశొకం మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను(Telangana) కేంద్రంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయె ఆసియా( Bio Asia) –2023’ హెచ్ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్ ను లక్ష్యంగా చేసుకొని, నిందితుడు సీనియర్ సైఫ్ వేధించాడని వరంగల్ ఏసీపీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. కాలనీలు, బస్తీలు, గల్లీల్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా బైకర్లు, నడిచి వెళ్లే వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నాయి. దీంతో తమ ఏరియాల్లో కుక్కలను అరికట్టాలంటూ జీహెచ్ఎంసీ (Ghmc) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం36 గంటల్లోనే15 వేల ఫిర్యాదులు వచ్చాయి
నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ (Governor) తమిళిసై సౌందరాజన్ను ఆమె సోదరినిలదీసింది. నిన్న ఆస్పత్రికి గవర్నర్ పూలదండతో వచ్చారని, అసలు పూలదండ ఎవరి కోసం తెస్తారు? అని ప్రశ్నించింది. తన సోదరి (sister) ఇంకా బతికే ఉందని, బతికున్న వారి కోసం పూలదండలు తీసుకొస్తారా? అని అడిగింది.