PDPL: జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆయిల్ ఫామ్ తోటలు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. సాగు వివరాలు తెలుసుకొని, ఆయిల్ ఫామ్ పంట పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంట సాగు విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రమ్య అనే మహిళ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు.