మహబూబ్నగర్ జిల్లాలోని 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లి, వడ్డెర బస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ గిరి గౌడ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.
BHNG: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలం నందనం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని అన్నారు.
VKB: కోట్పల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.5 కోట్ల నిధులు మంజూరైనట్లు మండల మాజీ వైస్ ఎంపీపీ వర్ధ మల్లికార్జున్ వెల్లడించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ పాత బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ నిధులు మంజూరు చేయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రక్తం నిలువలు భారీగా పడిపోతున్నాయి. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్లడ్ బ్యాంక్లో ప్రస్తుతం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకరికి రక్తం అందించేందుకు ఇద్దరు దాతల నుంచి రక్తం సేకరిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. రానున్న రోజుల్లో ప్రాణాపాయ స్థితి నెలకొనే పరిస్థితి ఉందని పలువురు వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
MDK: ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత ఆలయంలో శుక్రవారం వేకువజామున అమ్మవారికి ఆలయ అర్చకుడు రావికోటి పార్థివ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా జలాలతో పవిత్ర అభిషేకం చేసిన అనంతరం, పట్టువస్త్రాలు, రంగురంగుల పూలతో మాతను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి విశేష క్రతువుల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
KMM: రెవెన్యూ పన్ను వసూలు ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. నగరంలో పన్ను వసూళ్లు, ఆసరా పెన్షన్ల పంపిణీపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అధికారులతో గురువారం సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పెన్షన్ దరఖాస్తులన్నింటినీ వారం రోజుల్లోగా పరిష్కరించి, అర్హులకు ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు.
WNP: కొత్తకోట మండలంలోని మీరాసిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సర్పంచ్ వైదేహితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం రాజీ పడదని తెలిపారు.
KNR: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. మార్చి 4లోగా tgss.telangana.gov.in వెబ్సైట్లో నమోదుచేసుకోవాలన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMR: బిక్నూరు లోని అయ్యావారిపల్లి గ్రామ సర్పంచ్ జాల సత్యం విద్యుత్తు షాక్కు గురయ్యారు. గురువారం రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు సర్పంచ్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన స్వయంగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్కు గురయ్యారు. ఆయనను స్థానికులు GGH హాస్పిటల్ తరలించారు
సూర్యాపేట పట్టణానికి శుక్రవారం నుంచి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా సమృద్ధిగా సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ నివేదిత, కమిషనర్ హనుమంత రెడ్డి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇమాంపేటలోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద అత్యవసర మరమ్మతులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఇవాళ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు. డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.
NZB: నవీపేట్ మండలంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ, అయ్యప్ప ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. గురువారం అయ్యప్ప గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2,770 నగదు, బైక్, రాగి వైర్, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనే 7 కేసులు ఉన్నాయని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
MNCL: మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఓ వ్యక్తి గురువారం రాత్రి హల్చల్ చేశారు. మహారాష్ట్రకి చెందిన యువకుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపివేశారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడకు చేరుకోగా, పోలీసుల బుజ్జగింపులతో యువకుడు కిందకి వచ్చాడు.
WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ డీఎంహెచ్వో డా. ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.