• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేదల గుడిసెల కూల్చివేత అమానుషం: మాజీ ఎంపీ

KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెలను కూల్చివేయడం అమానుషమని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు లేదా నివాస స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:01 PM IST

37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని 37 పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 06:00 PM IST

ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. భూ సేకరణ సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు, భవనాలపై చర్చించారు.

February 24, 2026 / 06:00 PM IST

రామాయంపేట భూ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా

MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. నిర్వాసితులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. గజం ప్రభుత్వ విలువ రూ.5,000 ఉండగా కేవలం రూ. 600 చొప్పున పరిహారం ఇవ్వడంపై కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతిపత్రం ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి  కలెక్టర్ భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 06:00 PM IST

‘పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి’

NZB: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన గ్రామాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని వర్ని ఎస్సై వంశీకృష్ణ రెడ్డి సూచించారు. ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన వర్ని మండల కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని హెచ్చరించారు.

February 24, 2026 / 06:00 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: ఎస్సై

SRPT: నడిగూడెం మండల కేంద్రంలో ఈనెల 25 నుంచి మార్చి18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా మండలంలోని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు SI అజయ్ తెలిపారు. పరీక్షలు సాఫీగా జరిగేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడడం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 06:00 PM IST

అయ్యప్ప స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

WNP: వనపర్తి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో వాసవి మహిళా సంఘం సభ్యులు పాల్గొని సేవలు అందించారు. భక్తులు సమర్పించిన కానుకలను పారదర్శకంగా లెక్కించి భద్రపరిచారు.

February 24, 2026 / 06:00 PM IST

డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 2019-21 బ్యాచ్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు యూనివర్సిటీ చివరి అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానా లేకుండా మార్చి 16 వరకు, రూ.100 జరిమానాతో మార్చి 17 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:00 PM IST

పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం

SRD: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, మార్చి 14 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. 54 ఇంటర్, 123 టెన్త్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

February 24, 2026 / 05:57 PM IST

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన యశస్విని, ఝాన్సి

JN: సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై సీఎం అభినందనలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించి, ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 05:55 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

SRCL: ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాల అలాగే తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని టీజీఎస్ డబ్ల్యూఆర్జేసీ కళాశాలలో పరిశీలించారు.

February 24, 2026 / 05:48 PM IST

సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలన

NRML: మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు.

February 24, 2026 / 05:45 PM IST

టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం త్వరలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి భాగస్వామ్యం పంచుకున్నారు.

February 24, 2026 / 05:45 PM IST

మహిళా దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన కమిషనర్

RR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోస్టర్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, డీఆర్‌వో సంగీత ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని RR జిల్లాలోని మహిళా ఉద్యోగులకు మార్చి 4న హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని RR జిల్లా టీజీవో అధ్యక్షులు డాక్టర్ రామారావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి మహిళలకు ప్రత్యేక అనుమతి ఇప్పించాలన్నారు.

February 24, 2026 / 05:42 PM IST

హనుమాన్ దేవాలయ నిర్మాణానికి కౌన్సిలర్ చేయూత

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27 డివిజన్లో కౌన్సిలర్ తేజస్విని మంగళవారం కాలనీలలో పర్యటించారు. కౌన్సిలర్ వెంట మున్సిపాలిటీ అధికారులు, కాలనీ పెద్దలు ఇంటింటికి వెళ్లి సమస్యల తీవ్రతపై దరఖాస్తులను స్వీకరించారు. గత ఎన్నికల ముందు కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు హనుమాన్ దేవాలయ నిర్మాణంకు అవసరమైన మెటీరియల్‌ను పాలకమండలి సభ్యులకు అందజేశారు.

February 24, 2026 / 05:41 PM IST