KMM: ప్రతి విద్యార్థి చదివే నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ముదిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ను ప్రారంభించి విద్యార్థులతో మమేకమై వారి పఠన నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు.