MDK: టైర్ల నుంచి ఆయిల్, పౌడర్ తయారు చేసే పరిశ్రమను గ్రామంలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ చిన్న శంకరంపేట (M) కామారం గ్రామస్థులు అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామ శివారులో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.