MNCL: మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గురవయ్య తెలిపారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.