WNP: కొత్తకోట మండలంలోని పామాపురంలో 33/11 KV నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. సబ్స్టేషన్ ప్రారంభం తర్వాత గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తొలగి, రైతులకు నాణ్యమైన కరెంటు అందుతుందని తెలిపారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పల్లె పాగ ప్రశాంత్, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.