MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది ఆలస్యంగా హాజరుకావడం, పనులు వాయిదా వేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.