WNP: కాంగ్రెస్ మైనార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ.. అక్షర స్కూల్ యాజమాన్యాన్ని తాము డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే రాజీవ్ చౌరస్తాలో బహిరంగ ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని అన్నారు.