JN: లింగాలగణపురం మండలంలోని చిట్టచివరి గ్రామం రామచంద్రగూడెం గ్రామ చెరువుకి మొట్టమొదటి సారీగా గోదావరి జలాలు చేరుకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, రైతులకు పంటల సాగుకు నీటిని అందించేలా చర్యలు చూసుకుంటున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.