MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ గోశాల అభివృద్ధికి తొర్రూరు జడ్పీఎస్ఎస్ పూర్వ విద్యార్థులు విశేష సేవా భావాన్ని చాటుకున్నారు.1984-85 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి గోశాల నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి కోసం రూ.60,116 శనివారం విరాళంగా అందజేశారు.