TPT: ఎర్పేడు మండలం వికృతమాల గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తగా, దీనిని తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి రాయల్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి గంటలోపే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు తెలుగు గంగ పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు.