KMR: దోమకొండ మండలం చింతామణిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆడుకుంటున్న హర్షిని, జాహ్నవి అనే ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారులు గాయపడ్డారు. వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హర్షినికి కంటి వద్ద తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.