MDCL: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ PS పరిధిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన పన్నీరు నరసింహ(45) రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. ఈ విషయమై భార్య మందలించడంతో మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.